Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షిపణి దాడి జరుగుతోంది.. అంటూ మొబైల్ ఫోన్లకు సందేశాలు
- తప్పుడు వార్త అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
హవాయి : ''మనకు బాలిస్టిక్ మిస్సైల్ ముప్పు పొంచి ఉంది. ఇది డ్రిల్ కాదు. మీరు బయట ఉంటే వెంటనే దగ్గర్లో ఉన్న ఇళ్లలోకి వెళ్లండి. కిటికీల పక్కన కూడా ఉండొద్దు'' అంటూ.. మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తే ఏం చేస్తారు? తీవ్ర భయాందోళ నకు గురై, వణుకువస్తుంది కదూ! సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఆదివారం నాడు అమెరికాలోని హవాయి ప్రజ లు ఎదుర్కొన్నారు. అసలే అమెరికా, ఉ.కొరియా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మా దగ్గర బాంబు ఉం దంటే, మాదగ్గర అంతకన్నా పెద్దబాంబు ఉందని ఇరు దేశాల అధినేతలు మాటలతో హెచ్చరికలు జారీ చేశారు. వీటికి తోడు తమ రాష్ట్రం ఉత్తర కొరియా క్షిపణి పరిధిలోకి వస్తుంది. దీంతో తమకు ఇదే చివరి రోజని హవాయి ప్రజలు డిసైడయ్యా రు. మరి కొద్దిసేపట్లో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమనే భావనకు వచ్చారు. బాలిస్టిక్ క్షిపణి మన వైపు దూసుకు రాబోతోందని ప్రజల ఫోన్లకు సందేశాలు వెళ్లడంతో పాటు.. టీవీలు, రేడియోలు పదే పదే ఈ వార్తను ప్రసారం చేయడంతో జనం హడలిపోయారు. అది తప్పుడు వార్త అని 18 నిమిషాల తర్వాత ఈమెయిల్ వచ్చింది. కానీ ప్రజల ఫోన్లకు 38 నిమిషాల తర్వాతే ఆ విషయమై సందేశం అందింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.