Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 72మందికి గాయాలు
జకార్తా: జకార్తాలోని ఇండోనేషియా స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంలో వాక్స్వే అకస్మాత్తుగా కూలిపడటంతో ప్రమాదం సంభవించింది. దీంతో వాక్వేపై నడుస్తున్న 72 మంది గాయపడ్డారు. వీరిలో 17 మంది విషమంగా ఉన్నట్టు సమాచారం. విహార యాత్రలో భాగంగా విద్యార్థులు జకార్తాలోని స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం సందర్శనకు వచ్చారు. వివిధ కార్యాలయాలతో నిత్యం రద్దీగా ఉండే బహుళ అంతస్తుల(32) భవనాన్ని సందర్శిస్తుండగా.. ఒక అంతస్తులోని వాక్వే ఒక్కసారిగా కూలిపోయింది. వాక్వేపైకి పెద్దసంఖ్యలో విద్యార్థులు రావడంతో కూలినట్టు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనేకమంది పర్యాటకులు, ఇతర ఉద్యోగులను ఖాళీ చేయించారు.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జకార్తాలో అత్యంత ఆధునిక భవనాలలో ఒకటైన స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంలో ప్రమాదం సంభవించడంతో స్థానికంగా ఆందోళన రేపింది. ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంపై ఇప్పటికే ట్విట్టర్లో వీడియోలు, పోస్ట్లు వెల్లువెత్తాయి