Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాంటియాగో : అణ్వా యుధాలతో ప్రపంచ యుద్ధానికి కేవ లం ఒక్క అడుగు దూరం లోనే ఉన్నామని క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిలీ పర్యటనకు బయలు దేరిన ఆయన మీడియాతో మాట్లాడారు. హవాయిపై అణు దాడి జరగనుందని పొరపాటున జరిగిన ప్రచారాన్ని ప్రస్తావించారు. ఇటువంటి పొరపాట్లు విపరీత పరిణామాలకు దారి తీస్తాయని, వీటిని చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందని అన్నారు. ఏ దేశం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాల ప్రయోగాలపై దృష్టిపెట్దొదని కోరారు. అణ్వాయుధాలు తలెత్తితే మానవాళి మనుగఢ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం సంభవించినా అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందన్నారు. కాగా, వాటికన్ అధికారులు, నాగసాకిపై అమెరికా అణు బాంబు వేసిన తరువాత తీసిన ఓ చిత్రాన్ని బహుకరించగా, దాన్ని చూసి చలించి పోయిన పోప్, అది తన మనసును కలచివేసిందన్నారు. ఈ చిత్రం కాపీలను పంపిణి చేయనున్నట్టు తెలిపారు. చిలీలో పోప్ పర్యటన : చిలీ చేరుకున్న పోప్ ఫ్రాన్సిస్కు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. చిలీ అధ్యక్షుడు మిచెల్లీ బ్యాచులెట్ సాదరంగా ఆహ్వానించారు. ద క్యాథలిక్ రిజిస్టర్ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...పోప్ 17న చిలీలో, 18,19,20 తేదీల్లో లిమా, ప్యూర్టోమల్డొనాడో, ట్రుజిల్లో ప్రాంతాల్లో పర్యటించనున్నారు.