Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
అమెరికా సహకారంతోనే తమ సైన్యాన్ని పోషించుకుంటున్నామని అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు. అమెరికా నిధులే లేకుంటే ఆరు నెలల కంటే ఎక్కువ కాలం తమ సైన్యాన్ని పోషించుకోలేమన్నారు. సీబీఎస్ మీడియా సంస్థతో ఘనీ మాట్లాడారు. 'అఫ్ఘనిస్థాన్లో 21 ఉగ్రసంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తు న్నాయి. ఉగ్రవాదులు ఏ ప్రాంతంలో, ఏ రూపంలో, ఎప్పుడు పేలుళ్లకు పాల్పడతారో అర్థం కావడం లేదు. ఈ ఉగ్రసంస్థలన్నింటినీ కట్టడిచేసేందుకు అమెరికా సహకరిస్తోంది. యూఎస్ నిధులతోనే 16 ఏండ్ల నుంచి మిలిటెంట్లకు వ్యతిరేకంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. రక్షణ కార్యకలాపాల కోసం యూఎస్ అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటున్నాం. అమెరికా నుంచి ఇప్పటికీ 700 బిలియన్ డాలర్లు అందాయి. అఫ్ఘాన్లో 90శాతం మంది పౌరులు చెల్లిస్తున్న పన్నులు అమెరికా అందజేస్తున్న నిధులకు సమానం. బాంబులను తయారు చేసి ఉగ్రవాదులకు అత్యంత రహస్యంగా సరఫరా చేస్తున్న కర్మాగారాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. ఉగ్రసంస్థలను నిర్మూలించేందుకు 14వేల మంది అమెరికా సైనికులు అఫ్ఘాన్లో మోహరించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత అఫ్ఘనిస్థాన్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు' అని ఘనీ అన్నారు. ఉగ్రసంస్థలను కట్టడిచేయడంలో అష్రఫ్ ఘనీ ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా అండదండల తోనే అంత ర్గత, సరిహద్దు భద్రత నిర్వహించు కుంటున్నామని ట్రంప్ మెప్పుపొందేందుకు ఘనీ ఊదరగొడు తున్నారు. ఈనేపథ్యంలో ఘనీ సర్కార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఓ వైపు సాయం అందిస్తున్నట్టు కపటనాటకాలాడుతూ మరో వైపు ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న అమెరికా చర్యల పట్ల అఫ్ఘాన్ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.