Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్లో 10లక్షల మంది రోహింగ్యా శరణార్థులు
ఢాకా : బంగ్లాదేశ్లో 10లక్షల మంది రోహింగ్యా శరణార్థులను గుర్తించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. రోహింగ్యన్లను తిరిగి మయన్మార్కు పంపించనున్నట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం..రోహింగ్యన్లను రెండేండ్లలో మయన్మార్కు తిరిగి పంపాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్లోని శరణార్థుల శిబిరాల్లో 10,04,742 మంది రోహింగ్యన్లు తలదాచుకున్నట్టు సర్వేలో తేలిందని అధికారులు తెలిపారు. బయోమెట్రిక్ కార్డుల ఆధారంగా రోహింగ్యన్లను గుర్తిస్తున్నామని అన్నారు.