Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : నీటిపై తేలియాడే కారును జపాను ఆవిష్కరించింది. 2011, మార్చి11న జపాన్ ఈశాన్య తీర ప్రాంతంలో సునామీ రాకాసి అలలు విరుచుకు పడుతుంటే అక్కడ నుండి బయటపడేందుకు ప్రజలు కార్లలో పెద్ద సంఖ్యలో వెళ్ళిపోవడం చూసిన హిడెయొ సురుమాకి అనే వ్యక్తికి ఈ ఆలోచన వచ్చింది. సురుమాకి టయోటా మోటార్ కార్పొ రేషన్ సంస్థ మాజీ ఉద్యోగి. కార్లలో ప్రజలు వెళుతున్నా అలల తాకిడికి నెమ్మదిగా ఆ కార్లు కూడా మునిగిపోవడం చూసిన సురుమాకికి తన తల్లి గుర్తుకు వచ్చింది. భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం లోనే జీవించే ఆమె ఆ రోజున మిగిలిన వారిలా అక్కడ నుండి పారి పోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నడవలేకపోయింది. నీటిపై తేలియాడేలా కారు ఉంటే కొంతమందినైనా బతికి ఉండేవారేమో అని సురుమాకి ఆలోచన వచ్చింది. రెండేండ్ల తర్వాత ఆయన ఒక చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించారు. అది వరదనీటిలో కూడా ప్రయాణించగలదు. ఆయనకు వచ్చిన ఆలోచనను చాలామంది సమర్థి స్తున్నారు. ఈ ఏడాది చివరిలో థాయిలాండ్లోని బ్యాంకాక్ల పెట్ట బోయే ఫ్యాక్టరీలో ఏడాదికి 10వేల కార్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.