Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ
వాషింగ్టన్ : ఉగ్రవాద నిర్మూలనకు పాక్ కృషి చేయాలని ఐక్యరాజ్యసమితిలో(ఐరాస) అమెరికా రాయబారి నిక్కీ హేలీ కోరారు. ఉగ్ర సంస్థల నిర్మూలన పట్ల పాక్ తన వైఖరిని మార్చుకునేంత వరకు జాతీయ భద్రతా మండలి ఒత్తిడి తేవాలని అన్నారు. ఉగ్ర సంస్థలకు సహకారం, తద్వారా పొరుగు దేశాలను ఇబ్బందులకు గురి చేస్తున్న పాకిస్తాన్.. తన పద్ధతిని మార్చుకోవాలని నిక్కీ కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిక్కీ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.
భద్రతా మండలి సభ్యులతో నిక్కీ ఇటీవల అఫ్ఘనిస్థాన్లో పర్యటించి వచ్చారు. గురువారం తన పర్యటన వివరాలను ఆమె భద్రతా మండలిలో వివరించారు. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఆమె భద్రతా మండలిలో వినిపించారు. ''పాకిస్థాన్ మూలంగా అఫ్ఘనిస్థాన్ సమస్యలను ఎదుర్కొంటున్నది. తాలిబన్లకు పాక్ పరోక్షంగా సాయం చేస్తోంది. ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి. వివిధ దేశాలకు చెందిన 15 మందితో ఓ విభాగాన్ని ఏర్పాటు చెయ్యండి. తద్వారా పాక్పై ఒత్తిడి తీసుకురండి'' అని అఫ్ఘాన్ ప్రతినిధులు నిక్కీకి విజ్ఞప్తి చేశారు. చర్చల కోసం కాబూల్ ముందుకు వస్తుంటే పాక్ సర్కార్ మాత్రం కవ్వింపు చర్యలతో వెనక్కి తీసుకెళ్తోందని ఆమె విమర్శించారు. పొరుగు దేశాలను ఉగ్రవాదంతో ప్రభావితం చేస్తున్న పాక్ విషయంలో జాతీయ భద్రతా మండలి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
పాక్ మిలిటరీ శిక్షణ కోసం నిధులు మంజూరు...
పాకిస్తాన్కు భద్రతా పరమైన సహకారాన్ని అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఇప్పుడు సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. మిలిటరీ శిక్షణ కోసం మాత్రం నిధులను మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని పాక్ విదేశాగంగ కార్యదర్శి తెV్ామినా జన్జువా తెలిపారు.