Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సులో మంటలు చెలరేగడంతో 52 మంది మృతి
ఇర్గిజ్: కజికిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇర్గిజ్ జిల్లాలో ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, బస్సులోని 52 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇద్దరు డ్రైవర్లు సహా ఐదుగురు బస్సు నుంచి బయటికి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కజికిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం...ఇర్గిజ్ జిల్లాలోని ఆక్తోబ్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. సమారా-శ్యామ్కెంట్ రహదారిలో ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న 52మంది ప్రయాణికులు అగ్గికి ఆహుతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా 57మంది ప్రయాణిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులోని మృతులంతా ఉజ్బెకిస్థాన్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా రష్యా నుంచి వస్తున్నట్టు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు కజకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.