Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఫ్లోరిడా లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన దర్యాప్తుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాల్పులకు సంబంధించి గతనెలలోనే సమాచారం అందినప్పటికీ ఎఫ్బీఐ బృందాలు సకాలంలో స్పందిం చకుండా నిర్లక్ష్యం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్బీఐ సకాలంలో స్పందించి ఉంటే 17మంది విద్యార్థులను రక్షించుకోగలిగేవారమని అన్నారు. ఎఫ్బీఐ తీరు పట్ల అమెరికన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందినప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్లోరిడా రాష్ట్రం పార్క్లాండ్లోని ఓ పాఠశాలలో బుధవారం విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన పూర్వ విద్యార్థి నికోలస్ క్రూజ్కు సంబంధించి గత ఏడాది సెప్టెంబరులోనే సమాచారం అందిందని గురువారం అంగీకరించిన ఎఫ్బీఐ మరిన్ని సంచలన విషయాలను వెల్లడించింది. 19 ఏండ్ల క్రూజ్ విపరీత ప్రవర్తన, తుపాకులు కలిగి ఉండటం సహా నరమేధం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు గతనెల5న అతని స్నేహితుడు ఒకరు ఫోన్ చేసి చెప్పారని ఎఫ్బీఐ తెలిపింది. అయితే తమ అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, ఫలితంగా ఈ దాడి జరిగిందంటూ ఎఫ్బీఐ విచారం వ్యక్తంచేసింది. మృతుల కుటుంబ సభ్యులు ఎఫ్బీఐ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టగా, ఆ సంస్థ సారథి క్రిస్టోఫర్ పదవి నుంచి తప్పుకోవాలని ఫ్లోరిడా గవర్నర్ రెక్సో డిమాండ్ చేశారు. ఫ్లోరిడా వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ట్రంప్ పరామర్శించారు.