Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమల్లా:ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పాలస్తీనా ప్రధాని రమీ హందల్లా పిలుపునిచ్చారు. అకాబా నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఐక్యతగా ఉన్నపుడే అన్ని కుట్రల నుండి మన దేశాన్ని రక్షించుకోగలమని, చట్టబద్ధమైన హక్కు లను వినియోగించుకోగలమని అన్నారు. ఐక్యంగా ఉన్నపుడే అమెరికా తీసుకునే అన్యాయమైన నిర్ణయాలను, ఇజ్రాయిల్ ఉల్లంఘనలను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కావల్సిందల్లా పాలస్తీనా ప్రజల మధ్య ఐక్యతను బలోపేత ంచేయటంతో పాటు గాజా స్ట్రిప్పై పాలస్తీనా నేషనల్ అథారిటీ పూర్తి స్థాయి అధికారాలను దక్కించుకునేలా చూడాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక సాధికారికతతో పాటు సరిహద్దులపై అదుపు, శాంతి, భద్రతల పరిరక్షణాధికారం, న్యాయవ్యవస్థకు సంపూర్ణ అధికారం వంటివాటిని సాధించగలిగితే గాజా ప్రజల బాధలకు తెరదించవచ్చన్నారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విదేశీ ఆర్థిక సాయం తగ్గిందని, ఇది మరింత తగ్గే అవకాశం ఉన్నందున దీనిపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించటం కోసం ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నదని ఆయన చెప్పారు.