Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టర్కీ అధ్యక్షుడి ప్రధాన సలహాదారు యాసిన్ అక్తే
అంకారా : సిరియాలోని ఆఫ్రిన్ నగరంపై తాము రసాయనిక ఆయుధాలు ప్రయోగించలేదని టర్కీ పేర్కొన్నది. అంకారా సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటమే కాకుండా సిరియాలో రసాయనిక ఆయుధాల ప్రయోగానికి పాల్పడుతోందనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సైన్యంపై వచ్చిన విమర్శలను టర్కీ అధ్యక్షుడి ప్రధాన సలహాదారు యాసిన్ అక్తే ఖండించారు. కాగా, సిరియాలోని కుర్దు తిరుగుబాటుదారుల లక్ష్యంగా టర్కీ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రత్యేక ఆపరేషన్ కారణంగా సామాన్య పౌరులు మృతి చెందుతున్నారు. రసాయనిక ఆయుధాల ప్రయోగం జరగడంతోనే మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నదని సిరియాలోని హక్కుల పర్యవేక్షణ సంస్థ ఆదివారం పేర్కొన్నది. అల్షేక్ హదీద్ నగరంలోని కుర్దు తిరుగుబాటుదారుల శిబిరాల లక్ష్యంగా టర్కీ బలగాలు శుక్రవారం వైమానిక దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో మృతి చెందిన ఆరుగురు పౌరులు శ్వాససంబంధిత సమస్యతో మృతి చెందారు. రసాయనిక ఆయుధాల ప్రయోగం జరగడంతోనే పౌరులు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.