Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి
మాస్కో : రష్యాలో దగెస్థాన్లోని చర్చి ఆవరణలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రార్థనకు వెళ్తున్న క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రష్యా నిఘా సంస్థ అధికార ప్రతినిధి స్వెట్లానా పెట్రెంకో తెలిపిన వివరాల ప్రకారం...దగెస్థాన్లోని చర్చిలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. చర్చి ఆవరణలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తు న్నామని అన్నారు. ఈ ఘటనకు ఉగ్రవాదంతో ఏమైనా సంబంధాలు న్నాయా అనే అంశంపై విచారణ చేపడుతున్నామని పెట్రెంకో తెలిపారు.