Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్: టర్కీ ప్రయివేటు జెట్ విమానం ఇరాన్లో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్ కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...షార్జా నుంచి టర్కీలోని ఇస్తాంబుల్ నగరానికి బయలుదేరిన జెట్ విమానం జాగ్రస్ పర్వతాల్లో కూలిపోయింది. విమానం పర్వతాన్ని ఢకొీనడంతో మంటల్లో పేలిపోయిందని దేశ అత్యవసర సేవల విభాగం వెల్లడించినట్టు ఇరాన్ స్టేట్ మీడియా ఇర్నా ప్రకటించింది. విమాన ప్రమాదం సమాచారం అందుకున్న ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. విమానం టర్కీకి చెందిన బిజినెస్ టైకూన్ బసరన్ హోల్డింగ్ది. టర్కీలో ఆయనకు నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, ఫైనాన్స్కి చెందిన వ్యాపారాలు ఉన్నాయి. వీటన్నింటికీ బసరన్ కుమార్తె మినా బసరన్(28) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వ్యవహరిస్తున్నారు.
నెల రోజుల్లో వివాహం..ఇంతలోనే విషాదం...
మరో నెల రోజుల్లో మినా వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి విమానంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానానికి రాడార్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో ప్రమాదాన్ని ముందే ఊహించి తక్కువ ఎత్తులో విమానాన్ని నడపాల్సిందిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పైలట్ను హెచ్చరించింది. మెలికే కువ్వెట్ అనే మహిళ విమాన కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఆమె టర్కీలోని తొలి మహిళా పైలెట్లలో ఒకరు. పదవీ విరమణ పొందాక ప్రయివేట్ జెట్లకు ఆమె కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విమానం ఎక్కినప్పుడు దిగిన ఫొటోలతో పాటు తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను మినా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కాగా, విమానం కూలిన షెహ్రే కోర్డ్ ప్రాంతం టెహ్రాన్ నుంచి 370 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.