Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : జపాన్లో జరిగిన క్రోనిజం భారీ కుంభకోణంలో ప్రధాని షింజో అబే భార్య అకీపై ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆమెను ఉద్దేశ పూర్వకంగా తప్పించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని, ఆర్థికశాఖ ఒత్తిడి మేరకు ఆయన భార్యను కుంభకోణానికి పాల్పడిన వ్యక్తుల జాబితా నుంచి తొలగించినట్టు ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కేవలం ప్రధాని స్థాయి వ్యక్తి కాబట్టే తన భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికీ అనుమానం రాకుండా తప్పించారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వానికి చెందిన భూమిని మోరిటోమో గాకువెన్ ఓ విద్యాసంస్థ యజమానికి పెద్ద మొత్తంలో డిస్కౌంట్కు కట్టబెట్టారని, ఆ స్కూల్ యజమానితో అబే భార్య ఒప్పందాలు చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి నష్టం వచ్చిందని, అదొక పెద్ద కుంభకోణం అంటూ దానికి పాల్పడిన వ్యక్తుల జాబితాను రూపొందించారు. తొలుత అందులో అబే భార్య పేరు ఉన్నప్పటికీ తాజాగా విచారణ బృందం చేతికి వెళ్లే సమయంలో ఆమె పేరును మాయం చేశారు. దీనిపై అబే కూడా స్పందిస్తూ తనకు గానీ, తన భార్యకు గానీ ఆ స్కూల్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని, ఒక వేళ నిజంగానే సంబంధాలు ఉన్నట్టు గుర్తిస్తే కచ్చితంగా తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.