Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్్ : మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు మానవ హక్కుల పరిరక్షణకు సవా ల్గా మారాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియస్ గుటెరస్ తెలిపారు. తనను తాను గొప్ప స్త్రీవాదిగా పేర్కొన్న ఆయన అందరూ మహిళల హక్కులను సాధించటానికి, సమానత్వాన్ని సాధిం చటానికి చేయూతనివ్వాలని సూచించారు. మహిళలపై దాడులకు, వివక్షకు అనేక సంఘాలు, కంపెనీలు, ఆర్థిక వ్యవస్థలు బాధ్యులని వ్యాఖ్యా నించారు. మహిళల, బాలికల హక్కుల కోసం పోరాటం చేయాలని కోరారు. 'మీటూ', ' టైమ్ అప్' సోషల్మీడియాలో వస్తున్న కదలి కలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతు న్నాయని అన్నారు. మహి ళలు శాస్త్ర వేత్తలుగా, గణిత శాస్త్రజ్ఞులుగా మార్గదర్శకులుగా ఉన్నారు. అట్టడుగున ఉన్న గ్రామీణ మహిళల, బాలికల సాధికారతకు కృషి చేయాల్సిన అవసరముందని సూచించారు. ప్రపంచ వ్యాప్త పరిశోధన, అభివృద్ధి తదితర రంగాలలో 30శాతం కంటే తక్కువగానే మహిళ లున్నారని పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డులకు పురుషులు 33 మంది ఎంపిక కాగా, కేవలం ఆరుగురు మహిళలకే అవార్డులు దక్కాయన్నారు.