Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: గతంలో ఎఫ్బీఐ డిప్యుటీ డైరెక్టర్గా పనిచేసిన ఆండ్య్రూ మెక్కేబ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ వెల్లడించారు. అయితే పదవీ విరమణకు కేవలం ఒక్కరోజు కంటే ముందే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. దీని వల్ల ఆయనకు పదవీవిరమణ అనంతరం పొందే లాభాలు రాకుండా పోయే అవకాశం ఉంది. మెక్కేబ్ ఇటీవల తరచూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురవుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్కు కేవలం 26 గంటలు ఉందనగా ఆయనను ఉద్యోగం నుంచి తీసేయడం చర్చనీయాంశంగా మారింది. మార్చి 16న రాత్రి పది గంటల(అమెరికా కాలమానం ప్రకారం) సమయంలో జెఫ్ సెషన్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా మార్చి 18న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.మెక్కేబ్ 2016 ఫిబ్రవరి 1 నుంచి 2018 జనవరి 29 వరకు ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత తన పదవీవిరమణ రోజైన మార్చి 18వరకు సెలవు పెట్టారు. హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ సర్వర్ కేసు దర్యాప్తు విషయంలో సమాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు సహకరించారని, దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించారని ఎఫ్బీఐకి చెందిన ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ కార్యాలయం నివేదిక అందజేసింది. అంతర్గత దర్యాప్తు నివేదిక ప్రకారం ఆయనను ఉద్యోగం నుంచి తీసెయ్యొచ్చని సిఫార్సు చేసింది. దీంతో ఆయనను వెంటనే తొలగిస్తున్నట్టు అటార్నీ జనరల్ జెఫ్ ్సెషన్స్ వెల్లడించారు.
మెక్కేబ్స్ను తొలగించడం జస్టిస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశమని, అయితే ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని అధ్యక్ష నివాసమైన వైట్హౌస్ వెల్లడించింది. మెక్కేబ్స్ దాదాపు 20ఏండ్లపాటు ఎఫ్బీఐలో పనిచేశారు. పలు కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆదివారం రిటైర్ కావాల్సిన ఆయనను ఇలా ఉన్నట్టుండి తొలగించడంతో ఇన్నేండ్ల సర్వీసుకు సంబంధించి పెన్షన్ డబ్బు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు సమాచారాన్ని జర్నలిస్ట్లకు తెలియజేయడానికి తనకు అధికారం ఉందని మెక్కేబ్ పేర్కొన్నారు. ఇది తన విశ్వసనీయతపై జరుగుతున్న దాడి అని అన్నారు.