Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : టర్కీలో ప్రస్తుతం కొనసాగుతున్న అత్యవసర పరిస్థితులను తక్షణమే ఎత్తేయాలని ఐక్యరాజ్యసమితి టర్కీ అధ్యక్షుడు రిస్సెప్ తయ్యిబ్ ఎర్డో గన్ను కోరింది. టర్కీలో హక్కుల ఉల్లంఘన ఘటనలు పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. కాగా,టర్కీలో 2016, జులై15న సైనిక తిరుగుబాటు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ తిరుగు బాటును అణచివేయాలని దేశ ప్రజలకు ఎర్డోగన్ పిలుపునిచ్చారు. దీంతో, దేశ ప్రజలు వీధుల్లోకి చేరుకొని సైనికులను చితకబాదారు. ఫలితంగా సైనిక తిరుగుబాటు విఫలమైంది. అయితే, ఈతిరుగుబాటు వెనుక పెన్సిల్వేనియాలో ప్రవాసముంటున్న ఇస్లాం మత గురువు ఫెతుల్లా గులెన్ హస్తముందని ఎర్డోగన్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో గులెన్కు మద్దతిచ్చారనే ఆరోపణలపై పలు వర్సిటీల వీసీలను, సైనిక ఉన్నతాధికారులను, జడ్జీలను, సైనికులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను, పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. 2016, జులై నుంచి దాదాపు లక్షా 60వేల మంది అరెస్ట్ అయ్యారు. దీంతో, పాలన కుంటుపడింది. టర్కీలో ఎమర్జెన్సీ ఎత్తివేయాలని ఐరాస కోరింది.