Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: శత్రువులపై రక్తసిక్త పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన అంగుళం భూభా గాన్ని కూడా దురాక్రమణకు గురికాకుండా చూసుకుం టామని అన్నారు. పార్లమెంట్ ముగింపు సమావేశంలో జిన్పింగ్ మాట్లాడారు. చైనాను విభజించడానికి జరిగే ఏ ప్రయత్నమైనా విఫలం కాక తప్పదని అన్నారు. దేశం ముక్కలు కాకుండా చూడడమే ప్రజాభిమతం అని తెలిపారు. చైనా ప్రజలు తమ శత్రువులకు వ్యతిరేకంగా రక్తసిక్త పోరాటాలు సాగించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిన్పింగ్ ప్రసంగం - చైనా నుంచి వేరు పడాలని తైవాన్, హాంకాంగ్లాంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయత్నాలకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. అభివృద్ధి విషయంలో ఉపేక్షించబోమని తన ప్రసంగంలో జిన్పింగ్ పేర్కొన్నారు. కేవలం సోషలిజం మాత్రమే చైనాను రక్షించగలదని చరిత్ర నిరూపించిందని ఆయన తెలిపారు.
తైవాన్కు పరోక్ష హెచ్చరిక!
చైనా లక్ష్యాల గురించి చెబుతూ జిన్పింగ్, తమ దేశం బలోపేతం కావా లనుకుంటున్నా, అది దౌర్జన్యంతో కానీ ఇతర ప్రపంచాన్ని పణంగా పెట్టి కానీ కాదన్నారు. దేశాన్ని ముక్కలు చేయడానికి జరిగే ఏ ప్రయత్నమైనా విఫలం కాక తప్పదని, అలాంటి ప్రయత్నాలను చరిత్ర శిక్షిస్తుందని హెచ్చరించారు.