Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికాలో హెచ్1-బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2 నుంచి హెచ్1-బీ వీసా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు యూఎస్ పౌర వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. అలాగే హెచ్1-బీ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ను తాత్కాలికంగా రద్దు చేస్తు న్నట్టు ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రీమియం ప్రాసె సింగ్ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఈ వీసాల ద్వారా అమెరికా వెళ్తుంటారు. హెచ్1-బీ వీసాలతో అమెరికాలోని కంపె నీలు భారత్, చైనా లాంటి దేశాల నుంచి టెక్నాలజీ నిపుణులను వేల సంఖ్యలో నియమించుకుంటున్నాయి. హెచ్1-బీ తాజా దరఖాస్తులు 2019 ఆర్థిక సంవత్స రం కోసం తీసుకుంటున్నారు. 2019 సంవత్సరానికి ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు చేస్తున్నామని, అయితే ఈ ఏడాదికి సంబంధించి 2018, సెప్టెం బరు10 వరకు ప్రీమియం ప్రాసెసింగ్ను కొన సాగించనున్నట్టు తెలిపింది. ఈ ప్రీమియం ప్రాసెసింగ్కు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా ప్రజలకు సమాచారం ఇస్తామని యూఎస్ సీఐఎస్ స్పష్టం చేసింది. హెచ్1-బీ వీసా దరఖా స్తుల పరిశీలన సమయం తగ్గించేందుకే తాత్కాలికంగా ప్రీమియం ప్రాసెసింగ్ను నిలిపేస్తున్నా మని వెల్లడించింది.
గత కొన్నేండ్లుగా ప్రీమియం ప్రాసెసింగ్ దరఖా స్తులు ఎక్కువగా వస్తుండడంతో సాధారణ దరఖాస్తులు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉండిపోతున్నాయని, వాటి పరిశీలన సమయం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఏటా 65వేల హెచ్1-బీ వీసాలు జారీ చేస్తారు. యూఎస్సీఐఎస్ వివరాల ప్రకారం 2007 నుంచి 2017 సంవత్సరాల మధ్య హెచ్1-బీ వీసాల కోసం భారతీయులు అత్యధికంగా 2.2మిలియన్ల దరఖాస్తులు దాఖలు చేశారు.