Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 మంది మృతి, 52 మందికి గాయాలు
- ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించుకున్న ఐఎస్
కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఉగ్రదాడితో రక్తమోడింది. కాబూల్ లోని అలీ ఆబాద్ ఆస్పత్రి ఎదురుగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మృతి చెందారు. 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలో కాబూల్ యూనివర్సిటీ ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న భధ్రతా సిబ్బంది సహాయక చర్యల్లో నిమగమయ్యారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ ప్రకటించుకుంది. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...కాబూల్లో నూతన సంవత్సరం (నౌరజ్) ప్రారంభ వేడుకల్లో పాల్గొన డానికి గుమికూడిన వందలాది మందిని లక్ష్యంగా చేసుకొని ఐఎస్ ఈ దాడికి పాల్పడిందని అనుమానిస్తున్నామని అన్నారు. దాడికి గురైన వారిలో అత్య ధికులు అల్పసంఖ్యాకులైన షియాలు. ఈ దాడిలో 26మంది మృతి చెందారు. 52 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి కాలి నడకనే ప్రార్థనా స్థలం వద్దకు వచ్చాడనీ, పోలీసులు అతన్ని గుర్తించగానే అతడు తన ఒంటి మీదున్న బాంబును పేల్చేశాడని అన్నారు.
కాబూల్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కాబూల్ యూనివర్సిటీకి సమీపంలో, అలీ ఆబాద్ ఆస్పత్రి వెలుపల ఈ పేలుడు జరిగిందన్నారు. షియాలకు చెందిన ఈ ప్రార్థనా స్థలంపై గతంలో కూడా దాడులు జరిగాయి. 2016,అక్టోబర్లో జరిగిన దాడిలో 14 మంది మృతి చెం దారు. 2011లో జరిగిన మరో దాడిలో 59 మంది మరణించారు. ఇది కాబూల్ నగరంలో ఉన్న అతి పెద్ద ప్రార్థనాలయాల్లో ఒకటి. కాబూల్లో జరిగే నూతన సంవత్సర వేడుకలకు ఇది ప్రసిద్ధి గాంచింది. అఫ్ఘనిస్తాన్ జనాభాలో షియాల జనాభా 15 శాతం. వీరిలో అత్యధికులు హజారా అనే సముదాయానికి చెందినవారు.