Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 మంది మృతి, 27 మందికి గాయాలు
హనోయి: వియత్నాం లోని హౌ చి మిన్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవిం చింది. ఒక నివాస సముదా యంలో అక స్మాత్తుగా మంట లు చెలరేగడంతో 13మంది మృతి చెందగా, మరో 27 మంది తీవ్రంగా గాయపడి నట్టు పోలీసులు తెలిపారు. నివాస సముదాయంలో మూడు బిల్డింగ్లుండగా, వాటిలో 700 అపార్టుమెంట్లు ఉన్నాయని, వీటిని 6 సంవత్సరాల క్రితమే నిర్మించారని అధికారులు తెలిపారు. అయితే, మంటల్లో ఎంతమంది చిక్కుకున్నారన్న విషయంపై స్పష్టత లేదని, అలాగే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఎక్కువ మంది గందరగోళంలో భవనంపై నుంచి దూకడం వల్ల చనిపోయారని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదస్థలంలో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వియత్నాంలో 2002 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 60 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.