Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ఓ సముద్ర తీరానికి తిమింగలాలు కుప్పలుతెప్పలుగా కొట్టుకుని వచ్చాయి. దాదాపు 135 తిమింగలాలకు పైగా చనిపోయినట్టు తెలిసింది. మరో 15 తిమింగలాలను కాపాడటానికి రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. తిమింగలాలు కొట్టుకుని వచ్చిన ప్రాంతానికి సమీపంలో ఎవరూ ఉండొద్దని, షార్క్ చేపలు దాడి చేసే అవకాశముందని హెచ్చరించారు. అవి ఎందుకలా ఒడ్డుకు కొట్టుకొచ్చాయనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. 1996లో ఇదే బీచ్లో 320 భారీ తిమింగలాలు చనిపోయి కనిపించడం అప్పట్లో పెద్ద సంచలనమైంది.