Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి ,12 మందికి గాయాలు
- ఘటనాస్థలంలో మూడు గంటల పాటు ప్రత్యేక ఆపరేషన్
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఉలిక్కి పడింది. ట్రెబ్స్ నగరంలోని సూపర్ మార్కెట్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. సూపర్ మార్కెట్లోకి చొరబడిన ఉగ్రవాది పలువురిని బందీలుగా మల్చు కున్నాడు. ఉగ్రవాది చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించేందుకు దాదాపు మూడు గంటల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందాడని అన్నారు. ఎస్జీపీ చీఫ్ వెస్ లెఫెబ్వీర్ తెలిపిన వివరాల ప్రకారం...ట్రెబ్స్ నగరంలోని సూపర్ మార్కెట్లో ఉగ్రదాడి జరిగింది. సాయుధుడైన ఉగ్రవాది సూపర్ మార్కెట్లోకి ఓ కస్టమర్లా చొరబడ్డాడు. అనంతరం సూపర్ మార్కెట్కు వచ్చిన కస్టమర్లను బందీలుగా మల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నాస్థలాన్ని చుట్టుముట్టడంతో ముగ్గురిని కాల్చి చంపాడు. ఓ పోలీస్ అధికారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ అధికారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూపర్ మర్కెట్లో చొరబడ్డ ఉగ్రవాది దగ్గర భారీ మారణాయుధాలు ఉన్నాయని లెఫెబ్వీర్ తెలిపారు. కాగా, పారిస్లో 2015, నవంబర్13న ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 130 మంది మృతి చెందారు. ఈ పేలుళ్ల సూత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న సలాV్ా అబ్దెసలామ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
అతన్ని వెంటనే వదిలి పెట్టినట్టయితే సూపర్ మార్కెట్లో బందీ లుగా ఉన్నవారందరినీ వదిలేస్తానని ఉగ్రవాది తమకు సమాచారం చేరవేసినట్టు లెఫ్బ్వీర్ తెలిపారు. సూపర్ మార్కెట్ను భద్రతా బలగాలు చుట్టు ముట్టాయని, పౌరుల ప్రాణాలు తమకు అత్యంత ముఖ్యమని అన్నారు.
భద్రతా సిబ్బంది సూపర్ మార్కెట్ పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నాయని అన్నారు. సూపర్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తు న్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. మృతుల కుటుంబాలకు ఫ్రాన్స్ ప్రధాని ఎడౌరద్ ఫిలిఫ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు.
ఫ్రాన్స్లో జరిగిన దాడులు
ఫ్రాన్స్లో మూడేండ్ల నుంచి ఉగ్రదాడులు పెరిగిపోయాయి. ఆత్మాహుతి దాడులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
2017 అక్టోబరు 1: మార్సియెల్ రైల్వే స్టేషన్లో ఇద్దరు మహిళలను ఉగ్రవాదులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ ప్రకటించుకుంది.
2016 జులై 26: నార్మండీలో ఓ క్రైస్తవ మతబోధకుడిని ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు.
2016 జులై 14: నైస్ బీచ్ ప్రాంతంలో బాస్టిల్ డే వేడుకల్లో ఉన్న వందలాది ప్రజలపైకి భారీ ట్రక్కు దూసుకొచ్చిన ఘటనలో 86 మంది మరణించారు. ఆ తరువాత పోలీసుల కాల్పుల్లో డ్రైవర్ హతమయ్యాడు. ట్యూనీషియా జాతికి చెందిన జిహాదీ ఈ పని చేసినట్టు ఐఎస్ ప్రకటించుకుంది.
2016 జూన్ 13: పశ్చిమ పారిస్లోని మనావిల్లేలో ఒక పోలీసు అధికారినీ, ఆయన భార్యను ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. హంతకుడు ఐఎస్ సానుభూతిపరునిగా ప్రకటించుకున్నాడు. ఆ తరువాత అతనిని పోలీసులు కాల్చి చంపారు.
2015 నవంబరు 13: పారిస్లో జాతీయ స్టేడియం, కేఫ్లు, ప్రదర్శనశాలలు లక్ష్యంగా ఐఎస్ తుపాకులతో, బాంబులతో దాడులకు తెగబడింది. ఇందులో 130 మంది మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు.
2015 జనవరి 7-9: చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో ఇద్దరు ఉగ్రవాదులు చొరబడి 17 మందిని కాల్చి చంపారు. పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు.