Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతన చట్టం అమలు చేయాలని కార్మికుల డిమాండ్
ప్రిటోరియా : దక్షిణాఫ్రికాలో కార్మికులు కదం తొక్కారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎరుపు దుస్తుల్లో వేలాదిగా రాజధాని వీధుల్లోకి చేరుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని నిరసన గళం వినిపించారు. నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటడంతో యాజమానులు ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదని.. కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సౌత్ ఆఫ్రికన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ( ఎస్ఏఎఫ్టీయూ ) కార్మిక సంఘం ఈ నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించింది. ఎస్ఏఎఫ్టీయూ చేపట్టిన నిరసన కార్మికులకు స్థానిక ప్రజలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘం నేతలు మాట్లాడారు. పనిచేస్తున్న ప్రదేశాల్లో కార్మికులకు మెరుగైన వసతులు, మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పని గంటలు తగ్గించడంతో పాటు కార్మికులందరికీ కనీస వేతన చట్టం అమలయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.