Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ యువతకు వీసా విషయంలో చుక్కెదురవుతోంది. తాజాగా వెలువడిన ఒక నివేదిక వీసా ఆశావహులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశానికి చెందిన ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్లు, టీచర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన సుమారు 6100 మంది భారతీయులకు గత డిసెంబర్ నుంచి యూకే వీసాలను నిరాకరిస్తోంది. ద క్యాంపెయిన్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సీఏఎస్ఈ).. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూకే ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ నుంచి పొందిన గణాంకాల ప్రకారం.. నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులకు 57 శాతం వీసాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ వెలుపల నుంచి వీసాలు పొందిన అత్యధిక మంది విదేశీయులు కూడా భారతీయులే. కానీ ప్రస్తుతం ఉన్న యూకే ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల ఎంతో మంది వీసా పొందలేకపోతున్నారు.
వీసాల జారీలో బ్రిటన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇండియన్స్కు వీసాలు జారీ చేయడంలేదని దాదాపు 30వేల మంది ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. జాతీయ భద్రత పేరిట భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం వీసాల మంజూరు నిరాకరించడం పట్ల పిటిషనర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, టైర్ 2 వీసా కేటగిరీలో భాగంగా కంపెనీలు.. ఈయూ వెలుపలి నుంచి ఏడాదికి 20,700 మంది విదేశీ ఉద్యోగులని మాత్రమే నియమించుకునే అవకా శం ఉంటుంది. పరిమితి అయితే గడిచిన ఆరేండ్లకు నెలకు 1600 మంది చొప్పున ఉన్న పరిమితిని కేవలం ఒకే ఒక్కసారి పెంచారు.
గతేడాది డిసెంబర్ నుంచి ఈ పరిమితిని తగ్గిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 2017- మార్చి 2018 వరకు 6,080 మంది భారతీయ ఉద్యోగులకు వీసా నిరాకరించినట్టు తెలుస్తోంది.