Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తకు టెక్సాస్ వర్సిటీలో ఘన నివాళి
- 9మార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్..
హూస్టన్ : విద్యార్థులు, స్నేహితులు, తోటి శాస్త్రవేత్తలు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ప్రముఖ భారతీ య-అమెరికా భౌతిక శాస్త్రవేత్త జార్జ్ సుదర్శన్ అంత్యక్రియలు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్లో గురువారం జరిగాయి. కేరళలోని కొట్టయాంలో పుట్టిన ఆయన భౌతికశ ాస్త్రంలో అవిరళ కృషి చేశారు. శాస్త్రవేత్తగా అనేక సిద్ధాంత పత్రాల్ని రూపొందించారు. 9సార్లు నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతికి నామినేట్ అయ్యారు. 2007లో భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ భూషణ్' అవార్డుతో గౌరవించింది. ఆయన మృతి నేపథ్యంలో యూని వర్సిటీ ఆఫ్ టెక్సాస్ (ఆస్టిన్)లో తీవ్ర విషాధఛాయలు అలుముకున్నాయి. వర్సిటీలో భౌతికశాస్త్ర ఫ్రొఫెసర్గా 1969 నుంచి జార్జ్ సుదర్శన్ పనిచే స్తున్నారు. 5 దశాబ్ధాల సుదీర్ఘకాలంలో ఆయనతో ఏర్పడ్డ అనుబంధాన్ని వర్సిటీలోని సిబ్బంది, ప్రొఫెసర్లు, విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. గత ఆదివా రం 86 ఏండ్ల వయస్సులో జార్జ్ సుదర్శన్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇద్దరు కుమారులు అలెక్స్, అశోక్, భార్య భానుమతి ఉన్నారు. జార్జ్ సుదర్శన్ అంతక్రియల సమయంలో ఆయన ఇష్ట దైవం సరస్వతీ దేవిపై పాటను భార్య పాడటం...అక్కడివారి మనసును కదలించింది.