Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం ముగ్గురే మిగిలారు
లాహోర్: ప్రపంచంలో లెక్కకు మించిన భాషలున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఒక్కో భాష మాట్లాడుతుంటారు. ప్రపంచంలో ప్రత్యేకమైన భాష ఒకటుంది. దాని పేరు 'బదేషి'. పాకిస్తాన్లోని పర్వత ప్రాంతాల్లో ఈ భాషలో మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఈ భాష అంతరించిపోతోంది. ప్రపంచంలో ఈ భాష తెలిసినవారు ప్రస్తుతం కేవలం ముగ్గురే ఉన్నారు. బిషీ గ్రామంలో ఈ భాష తెలిసిన రహీం(75) మాట్లాడుతూ ''ఒక తరానికి ముందు ఈ గ్రామంలో అందరూ బదేషిలోనే మాట్లాడేవారు. ఇప్పుడు మా పిల్లలంతా పస్తూ భాషలోనే మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన యువకులు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి తరలిపోయి అక్కడి పస్తూ భాషను నేర్చుకుని అదే మాట్లాడుతున్నారు. అలాగే వివిధ భాషలను కూడా నేర్చుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఈ భాష తెలిసినవారు ముగ్గురే ఉన్నారని పేర్కొన్నారు.