Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : జర్మనీ ఫెడరల్ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ వచ్చే వారం చైనాలో అధికార పర్యటన జరపనున్నారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ మాట్లాడుతూ, గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో 24న మెర్కెల్కు విందు ఏర్పాటు చేశారని, అనంతరం ఆమె, లీ కలిసి పత్రికా సమావేశంలో పాల్గొంటారని లూ కాంగ్ చెప్పారు. 25తో పర్యటన ముగుస్తుందని తెలిపారు. ఏప్రిల్ మాసంలో నాల్గవ సారి ఛాన్స్లర్గా ఎన్నికైన తర్వాత మెర్కెల్ చైనాలో పర్యటించడం ఇదే మొదలు. జర్మనీతో కలిసి పనిచేయాలన్న ఆకాంక్షను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వెలిబుచ్చారు.