Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది మృతి
కాబూల్: ఉగ్రదాడితో అఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం రాత్రి నంగర్హర్ ప్రొవిన్స్లోని ఓ క్రికెట్ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఘటనలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు. రంజాన్ మాసం ప్రారంభం కావటంతో జలాలాబాద్లో ఓ ఎన్జీవో సంస్థ రాత్రివేళలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించింది. శుక్రవారం మ్యాచ్ను వీక్షించేందుకు వందలాది మంది ప్రేక్షకులు స్పింగర్ క్రికెట్ స్టేడియానికి వచ్చారు. ఆ సమయంలో వరుస పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. పేలుడు ధాటికి శరీర భా గాలు చెల్లాచెదురుకాగా, హాహాకారాలతో ప్రేక్షకులు పరుగులు తీశా రు. మూడు శక్తివంతమైన బాంబులు పేలాయని.. మృతుల సంఖ్య పెరి గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆఫ్ఘని స్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు.