Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీ ఛాన్స్లర్ మెర్కెల్
సోచి : మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఇంత సంక్లిష్టంగా మారడానికి కారణం అమెరికాయేనని జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ విమర్శించారు. సోచిలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన భేటీ సందర్భంగా మెర్కెల్ పై వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పౌర అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకోవటాన్ని ఆమె తప్పుబట్టారు. జర్మనీగానీ, మిగతా యూరప్ దేశాలుగానీ ఇరాన్ పౌర అణు ఒప్పందాన్ని కొనసాగించాలనే కోరుకుంటున్నాయని, భద్రతాపరంగా, నియంత్రణపరంగా, పారదర్శకతప రంగా...అన్ని విధాలుగా ఇదే అత్యుత్తమ ఒప్పందమని చెప్పారు.
ఖండాంతర క్షిపణి కార్యక్రమాన్ని ఇరాన్ ప్రారం భించిందనే విషయం గురించి యూరప్ దేశాలకు ఆందోళనలు ఉన్నాయని, అయితే ఇరాన్తో మాట్లా డుకోవటం ద్వారా వాటిని పరిష్కరించుకోవ చ్చునని ఆమె అన్నారు. పౌర అణు ఒప్పందం నుంచి అమెరి కా తప్పుకున్న సందర్భంగా, అనేక సమస్య లపై... సందేహాలపై ముందుకెళ్లటమెలా ? అన్నదాని గురించి ఆలోచిస్తున్నామని మెర్కెల్ చెప్పారు.
జర్మనీ-రష్యా ఆలోచనల మధ్య ఎంతో తేడా ఉన్నప్పటికీ, అధ్యక్షుడు పుతిన్తో అభిప్రాయాల్ని పంచుకోవటం చాలా ప్రాధాన్యతగల భేటీ అని మెర్కెల్ చెప్పారు. సమస్యల్ని పరిష్కరించు కోవాలనుకుంటే, మాట్లాడుకోవాల్సిందే కదా! అని ఆమె అన్నారు. 'ఉక్రెయిన్' సంక్షోభంపై మాట్లా డుతూ...మిన్స్వ్క్ ఒప్పందం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలదని, ఉక్రెయిన్లో శాంతి ఏర్పడటానికి ఇదొక్కటే మార్గమని అన్నారు. ఐరాస శాంతియుత దళాల్ని మోహరించటం ముఖ్యమైన అంశమని చెప్పారు. అలాగే సిరియా అంతర్యుద్ధం గురించి చెబుతూ, ఐక్యరాజ్యసమితి చేసే ప్రతీ ప్రయత్నానికీ జర్మనీ మద్దతు ఉంటుందన్నారు. ఐరాస మధ్యవర్తిత్వంతో అక్కడ రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.