Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖార్తౌమ్ : ఈజిప్టు దౌత్యవేత్తకు సూడాన్ సమ్మన్లు జారీ చేసింది. ఈజిప్టుకు చెందిన కొంతమంది పౌరులు సూడాన్లో వలసదారుల్లా జీవనం కొనసాగిస్తున్నారు. సూడాన్తో మమేకమై ఇక్కడి ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు. అయితే, వలసదారుల భావాలను కించపరిచే విధంగా ఈజిప్టులోని ఆన్టీవీ ప్రసారాలు చేసింది. వలసదారులను తివ్రవాదులతో పోల్చింది. ఈ ప్రసారాలపై సూడాన్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే ఇలాంటి ప్రసారాలను నిషేధించాలని సూడాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈజిప్టును కోరింది. తమ దేశంలో నివసిస్తున్న ఈజిప్షియన్ల మనోభావాలను కూడా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంటుందని వెల్లడించింది.