Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్ : సౌదీ అరేబియా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వెయ్యి మంది ఇథియోపియా ఖైదీలను విడుదల చేసేందుకు సౌదీ సర్కార్ అంగీకరించింది. ఆదివారం విడుదల కానున్న ఖైదీల్లో 100 మంది మహిళలు ఉన్నారు. కాగా, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ఇటీవల సౌదీలో పర్యటించారు. ఇథియోపియా ఖైదీల విడుదల అంశంపై సౌదీ రాజు సల్మాన్ను అభ్యర్థించారు. అహ్మద్ అభ్యర్థనపై సల్మాన్ సానుకూలంగా స్పందించి ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేశారు. ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాలో దాదాపు 5లక్షల మంది శరణార్థులు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా నివసిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీరందరినీ వారి స్వదేశాలకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 14వేల మంది ఇథియోపియా శరణార్థులను గతేడాది గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారుల పట్ల సౌదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.