Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద మొత్తంలో బంగారం, వెండి..
- విలువ సుమారుగా రూ.3,60,000 కోట్లు
బీజింగ్: అరుణాచల్ప్రదేశ్ సరిహద్దున చైనా ఆధీనంలోని ప్రాంతంలో పెద్ద మొత్తంలో బంగారం, వెండి, తదితర విలువైన లోహ,ఖనిజ నిక్షేపాలను ఆ దేశ భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఆ గనుల్లో లభ్యమయ్యే లోహాలు,ఖనిజాల విలువ దాదాపు రూ.3,60,000 కోట్లు(6000 కోట్ల డాలర్లు)గా అంచనా. భారత సరిహద్దులోని చైనాకు చెందిన లుంజే కౌంటీలో ఈ గనుల్ని కనుగొన్నట్టు హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం. దక్షిణ టిబెట్లో అరుణాచల్ప్రదేశ్ అంతర్భా గమని చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాదాన్ని
మరోసారి బలంగా ముందుకు తేనున్నదని ఆ వార్తా కథనం సారాంశం. ఆ ప్రాంతంలోని సహజ వనరుల వెలికితీత కోసం మౌలిక వసతుల కల్పన(రోడ్లు, వగైరా)పై చైనా దృష్టి సారించినట్టు ఆ కథనం తెలిపింది. లుంజే ప్రాంతంలో ఇటీవల భూగర్భ శాస్త్రవేత్తలు, నిపుణుల కదలికలు ఎక్కువైనట్టు ఆ కథనం తెలిపింది. ఇరు దేశాల సైన్యం మధ్య డోక్లాం(భారత్-చైనా-భూటాన్ త్రైకూడలి సరిహద్దు) ప్రాంతంలో గతేడాది 73 రోజులపాటు ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడుతున్న దశలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకోనున్నదా అన్న అనుమానాలను ఈ కథనం వ్యక్తం చేసింది.