Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలాదిమంది మొరాకో పౌరుల నిరసన ప్రదర్శన
రాబట్ : గాజా సరిహద్దుల్లో ఇజ్రాయిలీ బలగాలు పాలస్తీనియన్లపై కాల్పులకు పాల్పడటాన్ని నిరసిస్తూ వేలాదిమంది మొరాకో జాతీయులు కాసాబ్లాంకా నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో జరుగుతున్న దారుణమైన అత్యాచారాలకు ఇజ్రాయిల్ పూర్తి బాధ్యత వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మార్చి30 నుండి గాజాలో కొనసాగుతున్న 'ది గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్' కు వారు మద్దతు ప్రకటించారు. గతంలో తాము బహిష్కరణకు గురైన గ్రామాలకు, పట్టణాలకు తిరిగి చేరుకోవడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది పాలస్తీనియన్లు గాజా సరిహద్దుల్లో చేరి ఆందోళన చేపట్టారు.