Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ను గద్దె దించేందుకు సైనికుల్లోని ఓ వర్గం తిరుగుబాటుకు తెరలేపింది. ఈ తిరుగుబాటుకు సహకరించిన కేసులో దోషులుగా తేలిన 104మంది సైనికాధికారులను టర్కీ మిలిటరీ కోర్టు జీవితఖైదు విధించింది. 2016, జులై15న టర్కీలో సైనిక తిరుగుబాటు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ తిరుగుబాటు కారణంగా 260 మంది మృతి చెందారు. 2200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎర్డోగన్ పిలుపు మేరకు దేశ ప్రజలు వీధుల్లోకి చేరుకొని తిరుగుబాటుదారులను చితకబాదారు. దేశ ప్రజల మద్దతుతో సైనిక తిరుగుబాటు విఫలమైంది. అయితే, అమెరికాలోని పెన్సిల్వేనియా నగరంలో ప్రవాసముంటున్న మత గురువు ఫెతుల్లా గులెన్ ఈ తిరుగుబాటుకు కుట్రపన్నారని ఎర్డోగన్ అనుమానిస్తున్నారు. సైనిక తిరుగుబాటు ఆరోపణలపై దాదాపు 50వేల మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.