Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్బెర్నా: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్లో 1970ల్లో నలుగురు బాలలపై ఓ మతగురువు లైంగిక వేధింపులకు పాల్పడిన అంశాన్ని దాచిపెట్టిన కేసులో అడిలైడ్ ఆర్చిబిషప్ ఫిలిప్ విల్సన్ దోషి అని న్యూకేస్టిల్ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో శిక్షకు గురికానున్న అత్యంత సీనియర్ ఆర్చిబిషప్ ఈయనే. 1970లో పీడోఫైల్లో మతాచార్యుడిగా ఉన్న జేమ్స్ ఫ్లెచర్ నలుగురు బాలురను లైంగికంగా వేధించారు. ఈ కేసులో ఆయన 2004లో దోషిగా తేలారు. 2006లో ఆయన జైలులోనే మృతిచెందారు. ఘటన జరిగే నాటికి అక్కడ సహాయ మతాచార్యుడిగా ఉన్న విల్సన్ ఈ వేధింపుల గురించి తనకేమీ తెలియదని దాచిపెట్టారన్నది ఆరోపణ. కానీ, బాధితుల్లో ఒకరు ఈ మొత్తం వ్యవహారాన్ని విల్సన్కు చెప్పానని చెప్పడంతో ఆయన దాచిపెట్టినట్టుగా రుజువైంది. ఆయనకు రెండేండ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. 'బాధితుడు చేస్తోంది విశ్వసనీయ ఆరోపణే నని మతబోధకుడికి తెలుసు. అయినప్పటికీ చర్చిని, దాని ఖ్యాతిని రక్షించాలని ఆయన భావించాడు' అని జస్టిస్ స్టోన్ వ్యాఖ్యానించారు.