Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది పోలీసులు మృతి
కాబుల్: అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. తాలిబన్ల దాడిలో 14మంది పోలీస్ అధికారులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...తాలిబన్లు పోలీసుల లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. మృతుల్లో డీఎస్పీతో పాటు రిజర్వ్ పోలీస్ కమాండర్ ఉన్నారు. జగాతూ జిల్లాలో మరో దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు పోలీస్ అధికారులు మృతి చెందారు.