Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 65 మంది మృతి
కరాచీ : పాకిస్థాన్లోని కరాచీ పట్టణంలో వడగాడ్పులు వీస్తు న్నాయి. మూడు రోజుల్లో ఉష్ణ తాపానికి కరాచీలో 65 మంది చనిపోయినట్టు స్టేట్ మీడియా వెల్లడిం చింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. కరాచీలో సోమవారం అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంజాన్ ఉపవాస దీక్ష సమయం కావడంతో వడగాడ్పులతో 114 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 65 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది లంధి, కొరంగి ప్రాంతాలకు చెందినవారని అధికారులు తెలిపారు.