Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : క్యూబా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మంగళవారం నాటికి 111కి చేరుకుందని అధికారులు ధ్రువీకరించారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. ఈనెల 19న క్యూబాలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 100మంది మృతిచెందారు. విమాన ప్రమాద ఘటనపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి. ఘటనాస్థలిలో దర్యాప్తు వేగవంతం చేసేందుకు అవసరమైన బ్లాక్బాక్స్ కూడా లభ్యమైందని అధికారులు తెలిపారు.