Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : బంగ్లాదేశ్ కాక్స్ బజారులోని దాదాపు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు రోహింగ్యా శరణార్థులకు రుతుపవనాల తరుణంలో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఐరాస హెచ్చరించింది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి సీఫెన్ డుజారిక్ విలేకరులతో మాట్లాడుతూ గత సీజన్లో వారు అక్కడ సుమారు 7 వేల మంది ఈ విపత్తులకు గురయ్యారని గుర్తు చేశారు. ఈ రుతుపవనాల వల్ల కోక్స్ బజారులో 2.5 మీటర్ల వర్షపాతం నమోదవుతుందని, అక్కడ 883 సామాజిక సదుపాయాల్లోని శరణార్థులున్నారని, వారిలో సుమారు 25 వేల మంది క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.