Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెక్సాస్లోని శాంతా ఫి హైస్కూల్ కాల్పుల్లో మృతి చెందిన పాక్ విద్యార్థిని
ఇస్లామాబాద్ : అమెరి కాలో టెక్సాస్ నగరంలోని శాంతా ఫి హై స్కూల్లో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన పాక్ జాతీయురాలు సబికా షేక్ (17) అంత్య క్రియలు బుధవారం కరాచీ నగరంలో ముగిసాయి. అశ్రునయనాల నడుమ ఆమె అంతిమయాత్ర కొనసాగింది. ఆమె అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం ఆమె భౌతికకాయాన్ని ఖననం చేశారు. సబికా తండ్రి మాట్లాడుతూ...అమెరికాలో తుపాకీ సంస్కృతి శృతిమించిందనేందుకు తన కుమార్తె మరణం ఓ ఉదాహరణ అన్నారు. తుపాకుల అక్రమ రవాణాకు అమెరికా అడ్డాగా మారిందన్నారు. ఇకనైనా ట్రంప్ సర్కార్ కండ్లు తెరవాలని, అమెరికాలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. కాగా, టెక్సాస్లోని శాంతా ఫి హై స్కూల్లో గతవారం కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. డీమిట్రియోస్ పాగౌర్టిస్(17) అనే దుండగుడు పాఠశాలలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు టీచర్స్ సహా 10 మంది మృతి చెందారు. పోలీసులు డీమిట్రియోస్ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. అతనికి మరణశిక్ష పడే అవకాశముందని పోలీస్ అధికారులు చెప్పారు.