Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రఖ్యాత అమెరికా నవలా రచయిత ఫిలిప్ రోత్ (85) కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధి వల్ల రోత్ చనిపోయినట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. పులిట్జర్, నేషనల్ బుక్, మాన్ బూకర్ ఇంటర్నేషనల్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను ఆయన గెలుచుకున్నారు. అమెరికన్ పాస్టోరల్, ఐ మ్యారీడ్ ఎ కమ్యూనిస్ట్, పార్టోనీస్ కంప్లెయింట్ పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తన రచనా ప్రస్థానాన్ని ఆయన 1959లో చిన్న కథనాలతో మొదలుపెట్టారు. గుడ్బై కొలంబస్ ఆయన రాసిన ఫేమస్ స్టోరీ కలెక్షన్. శృంగారభరితమైన పోర్టోనీస్ కంప్లెయింట్ నవలతో ఆయన అమెరికాలో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్నారు. అమెరికన్ పాస్టోరల్ నవలకు ఆయన పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్నారు. 2011లో మాన్ బూకర్ ప్రైజ్ సొంతం చేసుకున్నారు.