Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయుగోళాలు, జల ఫిరంగులు ప్రయోగం
బ్యూనస్ ఎయిర్స్ : వేతనాల పెంపు కోరుతూ పాక్షికంగా సమ్మె చేస్తున్న బ్యూనస్ ఎయిర్స్ సబ్వే కార్మికులపై మంగళవారం పోలీసులు దాడిచేశారు. 300మంది కార్మికులపై 2వేల మందికి పైగా పోలీసులు దాడి చేశారు. రైళ్ళను ఆపాలని కార్మికులు భావించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభంతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న పొదుపు చర్యలతో కార్మికులు విసిగి వేసారిపోయారు. దాంతో తమ ఆందోళనలను ఉధృతం చేయాలని భావించారు. దీంతో హెచ్,ఈ లైన్లలోని సొరంగాల్లో కార్మికులపై మెట్రోపాలిటన్ పోలీసులు దాడికి దిగారు. బ్యూనస్ ఎయిర్స్ మేయర్ ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో పోలీసులు సబ్వే టన్నెల్స్పై దాడి చేశారు. రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు, బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. సొరంగాల్లోకి కార్మికులను పెద్ద సంఖ్యలో తోసివేశారు. 16మంది కార్మికులను అరెస్టు చేశారు. కార్మికులపై ప్రభుత్వం పాల్పడుతున్న అణచివేత చర్యల్లో పోలీసుల దాడి తాజాది. కంపెనీ గుర్తించిన యూనియన్ యుటిఎ ఈ ఏడాదిలో కార్మికుల వేతనాలను 15శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. అదికూడా మూడు దశల్లో పెంచాల్సి వుంది. అయితే ఈ ఏడాది ఐదు నెలల గడిచేసరికి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో వేతనాల పెంపు ఏమాత్రమూ కనిపించడం లేదని కార్మికులు ఆందోళన చెందారు.