Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మంది మృతి
బ్రజావిల్లే : కాంగోలో పడవ బోల్తాపడి మునిగిన ఘటనలో 50 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు కాంగో నదిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. 60 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. షువాప ప్రావిన్స్ వైస్ గవర్నర్ రిచార్డ్ బోయో తెలిపిన వివరాల ప్రకారం... మాంటోకా నుంచి బాందకా ప్రాంతానికి బయలుదేరిన పడవ మార్గం మధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 50మంది చనిపోయారు. అయితే, కాంగోలో ఎబోలా వైరస్ విజృభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇక్కడి ప్రజలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కాంగో నదీ మార్గంలో రాత్రిపూట ప్రయాణించడం నేరంగా పరిగణిస్తారు. చీకట్లో సరైన వెలుతురు లేకపోవడంతో పడవ మునిగిపోయి ఉంటుందని వైస్ గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు .