Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మంది మృతి
కాబూల్ : అఫ్ఘనిస్తాన్లో బాద్గిస్ ప్రావిన్స్లోని మిలిటరీ స్థావరాలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 30 మంది సైనికులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈనెల 20వరకు పాక్షిక కాల్పుల విరమణ పాటించాలని అఫ్ఘాన్ సర్కార్ తాలిబన్లను కోరింది. కాల్పుల విరమణ గడువు ముగియడంతో రెండు సైనిక శిబి రాలపై మెరుపు దాడికి పాల్పడ్డారని ప్రాంతీయ గవర్నర్ అబ్దుల్ ఖపూర్ మాలిక్జై తెలిపారు. సైనిక స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అన్నారు. కాల్పుల విమరణ ఒప్పందాన్ని మరో 10రోజుల పాటు పొడిగించాలని అఫ్ఘాన్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. అయితే, ప్రభుత్వ విజ్ఞాపనలను ఏమాత్రం పట్టించుకోకుండా అఫ్ఘాన్లో ఉద్రిక్త వాతా వరణం సృష్టించేందుకు తాలిబన్లు కుట్రపన్నారని మాలిక్జై తెలిపారు.