Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్ : యురోపియన్ యూనియన్లో ప్రధానమైన సంస్కరణలు తీసుకురావాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్లు అంగీకరించారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న సదస్సు సన్నాహాల్లో భాగంగా మంగళవారం వీరిరువురు భేటీ అయ్యారు. ఇరువురు నేతల చర్చల అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు.
కొత్త అధ్యాయం ప్రారంభించడానికి ఉభయ దేశాలు సిద్ధంగా వున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఏకపక్ష, సమన్వయం లోపించిన చర్యలు యూరప్ను విభజిస్తాయని, ప్రజలను చీలుస్తాయని ఆ ప్రకటన పేర్కొన్నది. ఈయూలో అతిపెద్ద దేశాలైన ఈ రెండు దేశాలు పలు అంశాలపై ఒక అంగీకారానికి వచ్చాయి. త్వరలో జరగబోయే ఈయూ సదస్సులో తదుపరి చర్చలకు ఇది పునాదిగా వుండగలదని భావిస్తున్నట్టు మెర్కెల్ విలేకర్లతో మాట్లాడుతూ చెప్పారు.