Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం
వాషింగ్టన్: అమెరికాలో 52 మంది భారతీయ వలసదారులు అరెస్టయ్యారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వారంతా అమెరికాలో నివసిస్తున్నారని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా, అక్రమంగా అమెరికాకు వలస వచ్చి ఉంటున్నారన్న ఆరోపణలపై వేలాది మందిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నట్టు సమాచారం. మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వీరు ఒరెగాన్ రాష్ట్రంలో ఆశ్రయం పొందడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని ఫెడరల్ నిర్బంధ కేంద్రంలో ఉంచారు. నిర్బంధ కేంద్ర సందర్శనానికి శనివారం వెళ్లిన చట్టసభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.
వీరితో కలిపి మొత్తం అక్కడ గత నెలలో 123 మంది అరెస్టుకాగా వారిలో అత్యధికులు దక్షిణాసియా వారే. వారిలోనూ హిందీ, పంజాబీ మాట్లాడేవారే ఎక్కువగా ఉన్నారు. అరెస్టయిన వారంతా కనీసం వారి న్యాయవాదులతో సంప్రదించే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదు. తమ జీవిత భాగస్వాములు ఎక్కడున్నారో, పిల్లలు ఏమైపోయారో తెలియని పరిస్థితి. అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
'దేశంలోకి అక్రమంగా వలస వచ్చి చిక్కిన పిల్లలు 12వేల వరకూ నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారని, వారిలో 10వేల మందిని వారి తల్లిదండ్రులే అక్రమంగా తరలించారని, మిగతావారంతా తమ తల్లిదండ్రులతో చట్ట విరుద్ధంగా వలస వచ్చి విడిపోయార'ని ట్రంప్ కార్యాలయం తెలిపింది. దేశంలో అక్రమ వలసలను నియంత్రించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రజాస్వామ్య వాదులు దేశానికి సమస్యగా మారారని.. దేశంలోకి అక్రమంగా చొరబడి కొంత మంది చేసే అకృత్యాలు, అరాచకాలు వారికి పట్టడం లేదని విమర్శించారు. దేశ భద్రత గురించి వారు ఆలోచించడం లేదని ట్రంప్ మండిపడ్డారు.
ట్రంప్ సర్కార్పై పోప్ విమర్శ
వాటికన్ సిటీ యంత్రాంగంలో ఎక్కువ మంది మహిళలు ఉండాలని కోరుకుంటున్నా వలసదారులపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వ తీరును క్రైస్తవుల (క్యాథలిక్) మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తప్పుబట్టారు. మెక్సికో సరిహద్దుల్లో తల్లిదండ్రులు, పిల్లలను విడదీస్తుం డటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వలసదారుల సమస్యకు ఇది పరిష్కారం కాదని అన్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేయడం క్యాథలిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, అనైతికమని ఇటీవల అమెరికాలోని క్యాథలిక్ బిషప్లు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. చైనాలో బిషప్ల నియామకాలకు మార్గం సుగమమవుతుందని తాను ఆశిస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. వాటికన్ సిటీ ఉన్నతస్థాయి పరిపాలన యంత్రాంగంలో ఎక్కువ మంది మహిళలు ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.