Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమత్రా: ఇండోనేషియాలో ఓ పడవ ప్రమా దానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 192 మంది గల్లంతయ్యారు. తోబా సరస్సులో ఈ ప్రమాదం సంభ వించింది. పరిమితికి మించి ప్రయాణికులను పడవలో తరలిం చడంతోనే ప్రమాదం సంభవిం చిందని అధికారులు అనుమాని స్తున్నారు. రంజాన్ సంబరాల నేపథ్యంలో తోబా సరస్సును సందర్శించేందుకు పర్యాటకులు బారులు తీశారు. దీంతో, ఎక్కువ మంది ప్రయాణీకులను పడవలో తరలించారు. మార్గం మధ్యలో పడవ మునిగిపోయిందని అధికారులు అనుమాని స్తున్నారు. కాగా, ప్రస్తుతం సుమత్రా దీవుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంది. కేవలం 18 మందిని మాత్రమే సహాయక బృందాలు రక్షించాయి. అయితే ఈ విషాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా స్పష్టంగా తెలియరాలేదు. గజ ఈతగాళ్లు, అండర్వాటర్ డ్రోన్ లతో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లేక్ తోబా సుమా రు 450 మీటర్ల లోతు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఏ ప్రాంతం లో బోటు మునిగిందన్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. సుమారు 25 మంది డైవర్లు .. అదృశ్యమైనవారి కోసం అన్వేషిస్తున్నారు. ఘటనా స్థలంలో 350 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపడు తున్నారు.