Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ఉత్తరకొరియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య అణ్వస్త్రనిరాయుధీకరణపై సింగపూర్లో గతవారం కీలక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అనంతరం తాజాగా కిమ్ చైనాలో పర్యటించారు. జిన్పింగ్తో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలపై, కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుత పరిస్థితిపై ఇరువురు నేతలు కూలంకషంగా చర్చిం చారు. చైనా, ఉత్తర కొరియా సంబంధాల పరిరక్షణకు, మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం కుదిరింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సంయుక్తంగా కృషి జరగాలని, తద్వారా ప్రపంచ, ప్రాంతీయ శాంతి సుస్థిరతలకు, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఇరుదేశాధినేతలు ఓ అంగీకారానికి వచ్చారు. ట్రంప్, కిమ్ల మధ్య జరిగిన సదస్సు సాధించిన సానుకూల ఫలితం, ఏకాభిప్రాయం పట్ల సంతోషంగా ఉన్నట్టు జిన్పింగ్ తెలిపారు. ఉత్తర కొరియా నేత చైనాలో పర్యటించడం చూస్తుంటే ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు ఆ దేశం ఎంత ప్రాధాన్యతనిస్తుందో తెలుస్తోందని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. గత మూడు మాసాల్లోనే మూడుసార్లు తామిరువురం కలిసామని, ఇరు దేశాల సంబంధాల అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని జిన్పింగ్ తెలిపారు.