Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : టర్కీలో దుండగులు జరిపిన కాల్పుల్లో తులూ (40) అనే పాప్ సింగర్ మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బోద్రామ్ రిసార్ట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. స్థానిక డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం...బోద్రామ్ రిసార్ట్లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ తులూ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం బయటకు వెళ్తున్న క్రమంలో ఆమెపై నలుగురు దుండగులు తూటాల వర్షం కురిపించారు. దీంతో, ఆమె అక్కడికక్కడే నేలకొరిగారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
తులూ మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు. పాప్సింగర్ అయ్యేందుకు ముందు ఆమె మోడలింగ్ రంగంలో పనిచేశారు. ఆమెకు 14ఏండ్ల కుమార్తె కూడా ఉంది. 2014లో తులూ విడుదల చేసిన పాటల ఆల్బమ్ విశేష ప్రజాధరణ పొందింది. ఈ పాటలను 42లక్షల మంది నెటిజన్లు సోషల్మీడియాలో వీక్షించారు.